మారేడ్పల్లి : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో పదిమంది లబ్ధిదారులకు పది చెక్కులు, అదేవిధంగా కంటోన్మెంట్ రెండవ వార్డులోని కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ భవనంలో లబ్దిదారులకు 19 కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఆడపడుచులకు కానుకగా ఈ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానం లోఉందని అన్నారు.
దేశంలో ఎక్కడ కూడ ఇలాంటి పథకాలు లేవని, తెలంగాణ రాష్ట్రంలోనే అమలు జరుగుతున్నాయన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సిఎన్. నర్సింహ్మముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల హరికృష్ణ, పిట్ల నాగేష్ ముదిరాజ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.