మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు.ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో మంచి నీరు , బోరు వాటర్ , వైద్యం కోసం అదనపు గదులు, దవాఖానా ప్రధాన ద్వారం వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ, దవాఖాన ఆవరణలో షెడ్డు, ఆలాగే ఆరోగ్య కేంద్రం శుభ్ర పరచడానికి ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఇక్కడి సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత తొందరగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన అదేశించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 226 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలలో 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో ఏదైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యసిబ్బందిని కోరారు. ఆరోగ్యకేంద్రంలో మౌళిక సదుపాయాలు కల్పిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్, యూత్ అధ్యక్షుడు రఘుయాదవ్, బాస శ్రీనివాస్, రమేష్, జిల్లా ఎన్సీ డి వైద్యఅధికారి డాక్టర్ జయంత్, కమ్యూనిటీ వైద్యఅధికారి సీరాజ్ఉద్దీన్, హెచ్ఈవో చెన్న కేశవులు, డాక్టర్ స్వాతి, హెల్త్ సుపర్వైజర్ శివకుమార్, సురేఖ, స్టాఫ్ నర్సులు జాకీరా ,కళ్యాణి, ఫౌజీయా, శ్వేత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.