మహేశ్వరం : విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1 కోటి 30 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఆక్సీజన్ ప్లాంటు పనులను ప్రారంభించిన అనంతరం 30 పడకల ఆసుపత్రి పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..
కరోన రాష్ట్రంలో విజృంభించిన తర్వాత వైద్య రంగాన్ని మరింత విస్తృత పరచడానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆమె అన్నారు. 12 వందల కోట్లనుండి 16 వందల కోట్ల వరకు హైద్రాబాదులోని గచ్చిబౌలీ, సనత్నగర్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ 4 ప్రాంతాలలో అన్ని సౌకర్యాలతో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆమె అన్నారు.
చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని ఆమె అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలలో ప్రతి బస్తీలో ఒక బస్తీ దవాఖానను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు.దాని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించెందుకు దోహదపడుతుందని ఆమె అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో కూడ బస్తీ దవఖానాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆమె అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 30 లక్షలతో సీఎస్ఆర్ ఫండ్ క్రింద ఆక్సీజన్ ప్లాంటు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశాంచారు.
మండల కేంద్రంలో 4 కోట్లతో 30 పడకల దవఖాన పనులకు సీఎం కేసీఆర్ నిధులను మంజూరు చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సీజన్ ప్లాంటు పనులను 15 రోజులల్లో పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అంగోతు రాజునాయక్, సహకారబ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆధిల్అలీ,సర్పంచ్ పరిగి చంద్రశేఖర్రెడ్డి, మాజీ వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంఏ సమీర్, మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్ కడమోని ప్రభాకర్, ఎంపీటీసీ హనుగల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.