బేగంపేట్ : అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగ నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రశాంత్సింగ్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వెస్ట్ మారేడ్పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి గెలిచి రెండు సంవత్సరాలు దాటిన నేటి వరకు ఒక్కసారైన ఈ ప్రాంత ప్రజలకు కలిశారా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి లేదా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను సనత్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు.
కోట్లాది రూపాయల వ్యయంతో గతంలో ఎన్నడు లేని విధంగ అనేక అభివృద్ధి పనులు చేసినట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక్తత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రశాంత్ సింగ్ తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో భరత్,వినాయక్సింగ్, విక్రాంత్సింగ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు అత్తెలి శ్రీనిస్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.