సికింద్రాబాద్ : నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మేరకు రసూల్పురా సిల్వర్ కంఫౌండ్లో అధనంగా నిర్మించనున్న మరో 56 ఇండ్లకు బుధవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి నిరుపేదకు డబుల్ ఇండ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. శంకుస్థాపన చేసిన ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరుపేదలకు నిలువెత్తు గౌరవం దక్కే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్లు పూరి గుడిసెల్లో నివసించిన నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారని పేర్కొన్నారు. ఆదే విధంగా ఇటీవల కాలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పెన్షన్లు పెంచారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు సదా కేశవరెడ్డి, పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, ప్రభాకర్తో పాటు టీఆర్ఎస్ నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, దేవులపల్లి శ్రీనివాస్, ఆశోక్గౌడ్, మణికంఠ, శర్విన్, మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.