సర్వాయి పాపన్న అడుగు జాడల్లో నడవాలి
కందుకూరు : బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో నడువాలని మండల గౌడ సంఘం నాయకులు కోరారు. ఆయన 371వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మండల గౌడసంఘం నాయకులు మాజీ ఎంపీపీ అశోక్గౌడ్, సౌడపు శేఖర్గౌడ్లు మాట్లాడుతూ నాటి రాజులపై తిరుగుబాటు చేసి బహుజనులకు అండగా నిలబడి పోరాట పటిమతో గెలిచినట్లు పేర్కొన్నారు. ఆయన ఆశయ పాధన కోసం పని చేస్తూ ఆశయాలను నెరవేర్చ డానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు ఆనేగౌని దామోదర్గౌడ్, పాండుగౌడ్, సౌడపు మురళీగౌడ్, వెంకటేష్గౌడ్, సిద్దేశ్వర్గౌడ్, రవీంద్గౌడ్; శివశంకర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను నెరవేర్చాలి
మహేశ్వరం: ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలని గౌడ సంఘం మాజీ అద్యక్షులు బస్వశంకరయ్యగౌడ్ అన్నారు.బుధవారం అమీర్పేట్ గ్రామంలో సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతిని పురస్కరించు కొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అన్నారు. ఈకార్యక్రమంలో కృష్ణగౌడ్,రాజేష్గౌడ్,అశోక్గౌడ్,పాండుగౌడ్,మల్లేష్గౌడ్,శ్రీకాంత్గౌడ్ పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి
ఆర్కేపురం : నిజాంను ఎదురించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జీ ముద్దగౌని రామ్మోహన్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమాన్ని సరూర్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముద్దగౌని రామ్మోహన్గౌడ్ హాజరై పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాల కిషన్, బుబ్బరి ఆనంద్గౌడ్, వెంకట్గౌడ్, ప్రసాద్, లోడి నర్సింహాగౌడ్, సిరిపురం రాజేష్గౌడ్, కందికంటి శ్రీధర్గౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.