షాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి వివిధ గ్రామాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 13 మందికి సీఎం సహాయనిధి చెక్కులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో సిబ్బందికి యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందించడం గొప్ప పరిణామమన్నారు.
కులమతాలకు అతీతంగా మైనార్టీలకు రంజాన్ పండుగకు, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగకు, హిందువులకు బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలు, దుస్తులు పంపిణీ చేస్తున్నదన్నారు. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న, ఎంపీడీవో అనురాధ, తహసీల్దార్ సైదులుగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికిరణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్రావు, శ్రీరాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, షాబాద్ సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, కోఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, నాయకులు శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, రాజేందర్రెడ్డి, జీవన్రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు చీరలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ బండారి శైలజ, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రాములు, సీనియర్ నాయకులు మిట్ట రంగారెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అండగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో స్వయం సహాయక సంఘాలకు రూ.14.34 కోట్ల రుణాల చెక్కులు, కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలను ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన దాఖలాలు లేవని అన్నారు. ఆసరా పింఛన్లు పెంచి అర్హులైన వారిని ప్రభుత్వం ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, మంజుల, బి రవళి, స్వరూప, రాఘవరెడ్డి, శ్రీనివాస్, నవనీత, దారెడ్డి శోభ, వనిత, పద్మమ్మ, పత్తమ్మ, ఎంపీటీసీలు శ్రీనివాస్, ఆర్ అర్చన, రాంరెడ్డి, ప్రభావతి, అంజయ్య, సుజాత, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్ తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : రాష్ట్రంలోని మహిళల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని జూలపల్లి, తలకొండపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహమాన్, రైతు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, ఎంపీడీవో రాఘవులు, తహసీల్దార్ కృష్ణ, సర్పంచ్లు చంద్రయ్య, ఈశ్వర్నాయక్, స్వప్న, శ్యాంసుందర్రెడ్డి, వెంకటయ్య, సక్రీ, వరలక్ష్మి, ధరణి, బుజ్జి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, రాజేందర్రెడ్డి, శివశంకర్రెడ్డి, హరిమోహన్రెడ్డి, శ్రీశైలంయాదవ్, తిరుపతి, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని భవానీ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, మున్సిపాలిటీ కమిషనర్ శ్యామ్సుందర్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం :రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్లు శ్వేత, పద్మ, జగన్, సుధాకర్, జ్యోతి, బాలరాజు, శ్రీలత, సుజాత, మమత, మంగ, శంకరయ్య, మోహన్నాయక్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : పండుగ వేళ మహిళలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని చైర్పర్సన్ చెవుల స్వప్న అన్నారు. బుధవారం 22వ వార్డు కుంట్లూరులోని స్వశక్తి భవన్ ఆవరణలో పలు వార్డులకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, వైస్ చైర్మన్ చామ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు చెవుల హరిశంకర్, గీత, సుజాత, అనుపమ, శ్రీధర్రెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు అజీరాబేగం తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ కృపేశ్ అన్నారు. చర్లపటేల్గూడ గ్రామంలో బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మహిళలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీత, ఎంపీటీసీ ఆంజనేయులు, ఉపసర్పంచ్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
కేశంపేట : ఎంపీపీ రవీందర్యాదవ్ ఆధ్వర్యంలో కోనాయపల్లి, సంతాపూర్లలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.