బంట్వారం, అక్టోబర్ 7: సమాజంలోని ప్రతి వ్యక్తికి తన హక్కులు, బాధ్యతలు తెలిసినప్పుడు నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని దీంతో నేరాలు తగ్గుతాయని వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాల గురించి తెలుసు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంటి నుంచే నేర నియంత్రణ ఉండాలన్నారు. ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు కోర్టు వచ్చి న్యాయం కొరకు పోరాడే స్థోమత లేదన్నారు. అయితే అలాంటి నిరుపేదలకు కోర్టుల్లో న్యాయం కొరకు పొరాడేందుకు సేవా సంస్థలు ఉన్నాయ న్నారు. అందులో భాగంగానే మండల్ లీగల్ సెల్ కమిటీ ఉంటుందన్నారు. న్యాయం కొరకు నిరు పేదలు ఈ కమిటీని ఆశ్రయిస్తే న్యాయం పొందే అవకాశం ఉంద న్నారు. ఈ సదు పాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకా శాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమం లో సర్పంచ్ లావణ్య, ఎంపీపీ ప్రభాకర్, సర్పంచ్ల సంఘం అధ్య క్షుడు నర్సింహులు, తహసీల్దార్ నాగార్జునారెడ్డి, జిల్లా పోలీస్ భరోసా సెంటర్ నిర్వాహకురాలు స్రవంతి పాల్గొన్నారు.
చట్టాలపై ప్రజలకు అవగాహన
బొంరాస్పేట, అక్టోబర్ 7 : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భా గం గా గురువారం మండలంలోని చౌదర్పల్లి, హంసా న్పల్లి, లిం గన్పల్లి, బొట్లవానితండా, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో కొడంగల్ మున్సిఫ్ కోర్టు ప్యానెల్ అడ్వకేట్లు సంతోష్, మల్లేశం ప్రజలకు చట్టాలపై అవ గాహన కల్పించారు. ప్రజలు చట్టాల గురించి తెలుసుకుంటే నేరాలు తగ్గుతాయని అన్నారు. కోర్టు లలో పేదలకు ఉచితంగా న్యాయ సేవ లు పొందే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, బాల్య వివా హాల వంటి గురించి వారు వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసాచారి, ఆయా గ్రామాల సర్పంచ్లు వెంకటమ్మ,మేఘ్యానాయక్, శ్రీధర్రెడ్డి, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.