సికింద్రాబాద్ : రైతు బంధు ‘రంగోలి’తో కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి.
రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు రైతుబంధు, బీమా పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేసిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని కళ్లకు కట్టేలా ముగ్గులతో వేసిన దృశ్యం అందరినీ ఆకట్టుకు న్నాయి. సుమారు వంద మంది ఆడబిడ్డలు వేసిన తీరొక్క రంగవల్లులతో సోమవారం కంటోన్మెంట్లోని మడ్ఫోర్ట్ ధోబీఘాట్ మైదానం మెరిసిపోయింది.
రైతుబంధు వారోత్సవానికి ముఖ్య అతిథిగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం కంటోన్మెంట్లో నిర్వహించిన ‘రైతుబంధు’రంగోలితో పాటు దోభీఘాట్ మైదాన స్థలంలో వేసిన ‘కేసీఆర్ ముగ్గు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో సాగు పండుగ చేశారని, పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరి మూలాలు గ్రామాల నుంచే ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుభీమా పథకాలు యావత్ దేశానికి దిక్సూచి అయ్యాయన్నారు.
ఎకరానికి రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10 వేలు వేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. పాసుబుక్ ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు జమ చేశారన్నారు. రైతుభీమాతో రాష్ట్రంలోని 71వే మందికి రూ.5లక్షల చొప్పున బీమా అందిందని గుర్తు చేశారు.
రైతులోకం కోరకున్నా ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో 65 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్కన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథ్, నళినికిరణ్, ప్రభాకర్తో పాటు నేతలు నివేదితా, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.