మాక్లూర్, సెప్టెంబర్ 8 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్లో ఎంఈవో రాజగంగారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభిరుచిని తెలుసుకొని ప్రోత్సహించాలని సూచించారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ కారణంగానే ఈ స్థాయికి చేరామన్నారు.
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఆదర్శంగా ఉంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపీపీ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులను చదువుతోపాటు క్రీడారంగంలోనూ ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం గురుకుల విద్యకు పెద్ద పీట వేస్తున్నదన్నారు. ఎంపీడీవో జైకా్రంతి, తహసీల్దార్ శంకర్, సర్పంచ్ అశోక్రావు, ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు, పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, చిలుక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, పీజీ హెచ్ఎంలు శ్రీహరి, మోహన్, రాజారావు, ఉపాధ్యాయులు తపస్ రామకృష్ణారెడ్డి, టీఎఫ్టీయూ నర్సింహాచారి, యూటీఎఫ్ గంగాధర్, అసోసియేట్ అధ్యక్షుడు దేవారెడ్డి, రాజేందర్, నాగరాజు, సునీత, సన్మానగ్రహీతలు పాల్గ్గొన్నారు.
ఆర్మూర్, సెప్టెంబర్ 8 : మండలంలోని చేపూర్ జడ్పీహెచ్ఎస్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీడీసీ సభ్యులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని, జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నవారు.
గురువులను గ్రామం తరఫున సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. హెచ్ఎం మాధవరెడ్డి, ఎంపీటీసీ బాలనర్సయ్య, ఎస్ఎంసీ చైర్మన్ నర్సయ్య, వీడీసీ చైర్మన్ సంజీవ్, సభ్యులు అనిల్, సత్యనారాయణ, జన్నేపల్లి గంగాధర్, రాజేశ్వర్, శంకర్దాస్, కొండవీటి శ్యామ్ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.