దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 6: మండలంలోని కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్ పదో తరగ తి విద్యార్థులు మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సరదాగా గడిపారు. వారితోపాటు చదువుకున్న పుట్టపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ పేదరికంలో ఉన్నాడని, దీనికితోడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో విషయం తెలుసుకున్న స్నేహితులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యచికిత్సకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఆంజనేయులు, జబ్బా ర్, విజయ్కుమార్రెడ్డి, నర్సింహరెడ్డి, నారాయణరెడ్డి, రవికుమార్, విజయ్కుమార్, శ్రీనివాస్, రవీందర్రెడ్డి, కుమా ర్, రాములు, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, చెంద్రశేఖర్రెడ్డి, వీరన్న, బాలస్వామి, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్ముఖ్
ప్రభుత్వం కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నది: మమతాబెనర్జి