కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ సర్కారు కేంద్ర బలగాలను బరితెగించి దుర్వినియోగపరుస్తున్నదని దుయ్యబట్టారు. మంగళవారం ట్విటర్ వేదికగా మమత బీజేపీపై మండిపడ్డారు. యూనిఫాంలలో ఉన్న పలువురు వ్యక్తులు పోలింగ్ బూత్ల వద్ద బీజేపీకి అనుకూలంగా ఓటేసేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బలగాలు బహిరంగంగా బెదిరిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదని విమర్శించారు.
కాగా, మమతాబెనర్జీ తాను పోటీచేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపించారు. అయితే, ఆమె ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్