బయ్యారం ఏప్రిల్ 3 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ చైర్పర్సన్ ఏ బిందు సూచించారు. శనివారం మం డల కేంద్రంలోని ఎండీవో కార్యాలయంలో ఎంపీపీ మౌనిక అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సర్వసభ్య సమావేశం అంటే మొక్కబడి సమావేశం కాదన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడం, చేపట్టిన ప్రగతిపై సమీక్షంచేందుకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కానీ, కొందరు అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారన్నారు. అనంతరం పలు విషయాలపై సమావేశంలో వాడివేడిగా చర్చించారు. వైద్య శాఖ నిధులతో పంచాయతీ పాలకవర్గం ద్వారా కొనుగోలు చేయాల్సిన స్పెయింగ్ మిషన్ను జిల్లా పంచాయతీ అధికారులు కొనుగోలు చేయడంపై పలువురు సర్పంచ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిధులు సద్వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్పందిచిన జడ్పీ చైర్మన్ ఈ విషయంపై వివరాలతో నివేదిక అందిచాలని ఎంపీవోను ఆదేశించారు. పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు గిరిజన రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, సర్పంచ్లు సభ దృష్టికి తీసుకవచ్చారు.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన..
సర్వసభ్య సమావేశంలో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా ఉద్యాన అధికారి సూర్యనారాయణ అవగాహన కల్పించారు . పామాయిల్ సాగుకు మండలంలోని నేలలు అనువుగా ఉన్నాయని, రైతులను చైతన్య పరిచి ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి పెంచాలని సూచించారు. ఆయిల్ పామ్ సా గుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం కరోనా వ్యాక్సిన్పై జిల్లా వైద్యాధికారి శ్రీరాం అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో చలపతిరావు, వైస్ ఎంపీపీ గణేశ్, సొసైటీ చెర్మర్ మధూకర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
రోబో వేసిన పెయింటింగ్కు రూ.5 కోట్లు