రామాయంపేట, సెప్టెంబర్ 19: రామాయంపేట మండలం దామరచెర్వు, పట్టణంలోని మార్కండేయ, వైశ్యభవనం, శీతయ్యగుడి, శివాలయంలోని వినాయకలకు నిమజ్జనాలు నిర్వహించారు
నిజాంపేటలో..
నిజాంపేట,సెప్టెంబర్19: మండల వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలను జరుపుకోవాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. మండలంలోని నస్కల్ కోమటి కుంటలో గ్రామ యూత్ సభ్యులు నిర్వహించిన గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు
కొల్చారంలో..
కొల్చారం, సెప్టెంబర్ 19: మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథులు తొమ్మిది రోజులుగా పూజలు చేసి ఆదివారం తెల్లవారుజాము నుంచి గ్రామాల్లో ఊరేగించారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు.
మండపాల వద్ద పటిష్ట చర్యలు
రామాయంపేట, సెప్టెంబర్ 19: గణేశ్ నిమజ్జన ప్రాంతాల చెరువులో ఏర్పాట్లు చేసినట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ అన్నారు. రామాయంపేట పట్టణంలోని కొచ్చెరువు, వెంకన్నగారి చెరువుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని చైర్మన్ తెలిపారు. వినాయక నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే చెరువుల వద్ద అన్ని ఏర్పాటు చేశామని చైర్మన్ విలేకర్లకు తెలిపారు.
పంచ విగ్నేశ్వరుల శోభాయాత్ర…
నర్సాపూర్,సెప్టెంబర్19: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో పంచ విగ్నేశ్వరుల (ఐదు వినాయకులు) శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం రాయారావు చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, కౌన్సిలర్ లత రమేశ్ యాదవ్, ఉత్సవ కమిటీ నిర్వహకులు సంతోశ్ చారి, చెన్నయ్య, పిల్లి నర్సింహులు, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పెద్దచింతకుంటలో…
మండల పరిధిలోని పెద్దచింతకుంటలో సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. వినాయకుడిని గుర్రం బండిపై గ్రామంలో ఊరేగించి పూజలు జరిపించారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
చేగుంటలో…
చేగుంట,సెప్టెంబర్19: చేగుంట నార్సింగితో పాటు పలు గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు ఉదయం,సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేశారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, సెప్టెంబర్ 19: మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు ఆయా గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలు పూర్తి కావడంతో యువకులు, భక్తులు నిమజ్జనాలను పూర్తిచేశారు.