టేక్మాల్, సెప్టెంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో తల్లీబిడ్డల ఆరోగ్యానికి… శిశువుల సంపూర్ణ వికాసానికి పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటు న్నది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషక విలువలు కలిగిన భోజనాన్ని కడుపునిండా పెట్టేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనతతో మహిళలు పడుతున్న ఇబ్బందులను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మా తాశిశు సంరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోంది. గర్భిణులు, బాలింతలకు అవసరమైన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందించేందుకు ప్రత్యేక కార్యచరణతో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో పెడుతున్న భోజనం సరిగ్గా లేకపోవడం.. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు రావడానికి సుముఖంగా లేరని, కొంతమంది వచ్చినప్పటికీ కోడిగుడ్లు తీసుకుని వెళ్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించినది. ఆయా సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు ఒక పూట పోషకాలతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యపరీక్షల కోసం వచ్చే గర్భిణులు, బాలింతలకు కూడా భోజనాన్ని అందిస్తున్నారు. కరోనా పరిస్థి తుల కారణంగా భోజనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ ఒక్కొక్కరికి రోజుకు రూ.150 గ్రాముల బి య్యం, 30 గ్రాముల పప్పు, ఒక కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, 50 గ్రాముల కూరగాయలతో పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకంలో గర్భిణులు, బాలింతలకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేదరికంలో మగ్గుతూ సరైన పౌష్టికాహారం అందక అనారోగ్యానికి గురై అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంతో వారికి లబ్ధి చేకూరుతున్నది.
మెరుగైన పౌష్టికాహారం అందజేత
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు రేట్లు ఎక్కువగా నిధులను ఖర్చుచేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, కూరగాయలతో భో జనం అందించేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకు రూ.21లకు పెంచింది. కేంద్రం నుంచి ఒక్కొక్క గర్భిణి, బాలింత ఆహారం కోసం రూ. 3.50 కేటాయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఐదు రేట్లు అదనంగా ఖర్చుచేస్త్తోంది.