హవేళీఘనపూర్, సెప్టెంబర్ 16: హవేళీఘనపూర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ 18 ఏండ్ల్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మండల కో- ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, గ్రామ సర్పంచ్లు లక్ష్మీనారాయణ, సవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మం డల నాయకులు మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పాపన్నపేటలో..
పాపన్నపేట, సెప్టెంబర్16: కరోనా వ్యాక్సిన్18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎంపీపీ చందన, ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు.ఎంపీపీ చందన, యూసుఫ్పేట, మిన్పూర్, కొత్తపల్లి గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 8 సబ్సెంటర్లతో పాటు పొడ్చన్పల్లి సబ్సెంటర్ పరిధిలోని 6 కేంద్రాల్లో శుక్ర, శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జగన్, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్రెడ్డి, ఏపీవో లక్ష్మీకాంతరెడ్డి నా యకులు శ్రీనివాస్, మనోహర్ ఉన్నారు.
మెదక్ మండల పరిధిలో …
మెదక్రూరల్ ,సెప్టెంబర్16: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని మెదక్ ఎంపీడీవో శ్రీరాములు సూచించారు. మెదక్ మండల పరిధిలోని రాజ్పల్లి , పాతూరు, మక్తాభూపతిపూర్ , మంబోజిపల్లి , వెంకటపూర్ గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏ ర్పా టు చేయడంతో ఎంపీడీవో శ్రీరాములు పరిశీలించారు. కార్యక్రమంలోఎంపీవో మౌనిక, సర్పంచ్లు ప్రభాకర్ ,నర్సింహులు నాయకులుబాలయ్య పంచాయతీ కార్యదర్శులు, శ్రీధర్, నయీం, ప్రభాకర్ వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు
పట్టణంలో పలువురికి వ్యాక్సినేషన్
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 16: ప్రభుత్వం18 సంవత్సరాలు పైబడిన వారందరికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పా టు చేశారు.మొదటి, రెండోడోస్ వ్యాక్సిన్ ప్రజలకు వైద్య సిబ్బంది వేశారు. 9వ వార్డులో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని వార్డు కౌన్సిలరల్ మేడి కల్యాణి, మాజీ మార్కెట్కమిటీ చైర్మన్ మధుసూదన్రావు పర్యవేక్షించారు.
టేక్మాల్లో..
టేక్మాల్, సెప్టెంబర్ 16: కరోనా వైరస్ను నియంత్రించడానికి వ్యాక్సిన్ను తప్పని సరిగా వేయించుకోవాలని ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది కోరుతున్నారు. మం డల పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో మొదటి,రెండో విడుత కరోనా వ్యాక్సిన్ వేశారు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ప్రకృతివనంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 16: మండలానికి ఒక ఆహ్లాదకరమైన ప్రకృతివనం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మండల పరిధిలోని శాలిపేటలో స్థలాన్ని గుర్తించి త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం శాలిపేటలో బృహత్ ప్రకృతివనంలో మొక్కలు నాట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరస్తులను గుర్తించవచ్చు
చిన్నశంకరంపేట,సెప్టెంబర్16: సీసీ కెమెరాలతో నేరస్తులను గుర్తించవచ్చని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం గవ్వలపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం చిన్నశంకరంపేటలో హైదరాబాద్ డెక్కన్ రౌన్టేబుల్ సంస్థ అందించిన డెస్క్లను మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు డెస్క్లను అందించిన సంస్థ ప్రతినిధులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, రైతు బంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు,తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.