అమీన్పూర్, అక్టోబర్ 9 : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్శాఖకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భరత్నగర్,మధురానగర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బాలాజీ నగర్లో రూ.85 లక్షల అంచనాతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికి సీసీ కెమెరాలు పనిచేస్తాయన్నారు. ప్రజల రక్షణకు, దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ప్రజలకు ఆయన సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తన వంతు సాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రహదారులు బాగుంటేనే నియోజకవర్గం, మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయన్నారు. నియోజకవర్గంలో అన్ని కాలనీలకు సీసీ రోడ్ల నిర్మాణం కోసం కావాల్సిన నిధులు అందజేస్తామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నేతృత్వంలో బాగా అభివృద్ధి జరుగుతున్నదని ఆయన కీతాబిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, డీఎస్పీ భీమ్రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి, స్థానిక కౌన్సిలర్లు కవితా శ్రీనివాస్రెడ్డి, బాసెట్టి కృష్ణ,కొల్లూరి మల్లేశ్ కోఆప్షన్ సభ్యులు తలారి రాములు, యూనుస్, నాయకులు రమేశ్గౌడ్, శేఖర్, గోపాల్, మల్లేశ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాల్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.