పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
ఆహ్లాదపరుస్తున్న పల్లె ప్రకృతి వనం
ఆకట్టుకుంటున్న చిల్డ్రన్ పార్కు
చెత్త సేకరణతో గ్రామం పరిశుభ్రం
ఆదర్శంగా వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు
బాలానగర్, ఏప్రిల్ 4: ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతి వనం.. ఎటు చూసినా హరితహారం మొక్కల పచ్చదనం.. సకల సౌకర్యాలతో వైకుంఠధామం, నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు, అద్దంలాంటి వీధులు పెద్దాయపల్లి సొంతం. పల్లెప్రగతి కార్యక్రమంతో ఏండ్లుగా తిష్టవేసిన సమస్యలు తీరాయి. గ్రామ రూపురేఖలే మారిపోయాయి. మొన్నటి దాకా నిధుల లేమితో అల్లాడిన పంచాయతీకి నేడు నిధుల వరదతో అన్ని వసతులు సమకూరాయి. ఆదర్శ బాటలో పయనిస్తున్నది.
బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామంలో నిర్మించిన ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామంలో రెండేండ్ల కింద పాడుబడిన బావులు, కూలిపోయిన ఇండ్లు, మురుగు కాల్వలో నిండిన దుర్గంధం, వీధులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. అయితే, పల్లె ప్రగతితో గ్రామానికి మహర్దశ పట్టింది. నిర్ధేశించిన పనులను దశల వారీగా చేపట్టిన గ్రామాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచారు. గ్రామ శివారులో రూ.12.5లక్షలతో వైకుంఠధామం, రూ.2.5లక్షలతో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు.
పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. హరితహారం కింద విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ ట్రాక్టర్ సాయంతో ప్రతి రోజూ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి వీధిలో మురుగు కాల్వలు ఏర్పాటు చేయడంతో పాటు రోజూ వాటిని శుభ్రం చేస్తున్నారు. ఫలితంగా వీధులన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఎకరన్నర స్థలంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో ప్రస్తుతం టేకు, నిమ్మ, గులాబీ, చైనాబాదం, చామంతి మొక్కలు పెంచుతున్నారు. హారతహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో 3,820 మొక్కలు నాటి నిత్యం నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో రోడ్లు శుభ్రం చేయిస్తున్నారు.
అభివృద్ధి చేస్తున్నాం
ప్రజలు, అధికారుల సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పల్లె ప్రగతితో అన్ని సమస్యలు తీరాయి. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. నిబద్ధతతో పని చేస్తున్నాం.
ప్రజల సహకారంతో..
ప్రజల సహకారంతోనే పంచాయతీ అభివృద్ధి సాధ్యమవుతున్నది. పంచాయతీలో తడి, పొడి, చెత్త సేకరణపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపడుతున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులకు
దాదాపుగా పూర్తి చేశాం.
ఇవి కూడా చదవండి
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా
గ్రేటర్లో న్యూ జనరేషన్ ట్రామ్ వే
కట్టేసి కొట్టారు.. కలతచెంది ప్రాణం తీసుకున్నాడు