జైనూర్, ఏప్రిల్ 7 : కరోనా సెకండ్ వేవ్ వేగం పుంజుకున్న తరుణంలో వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా వైద్యాధికారి కుమ్ర బాలు సూచించారు. మండలంలోని ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. మండలంలో వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యసిబ్బందితో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు వారి పరిధిలోని గ్రామాల్లో ప్రతిరోజూ 10 వ్యాక్సిన్లు వేసేలా కృషిచేయాలని సూచించారు. వైద్యుడు జితేందర్రెడ్డి, హెచ్ఎస్ లక్ష్మీకుమారి, కిశోర్, ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, హెచ్ఏ భరత్, జంగు, రమేశ్, ఏఎన్ఎంలు పరమేశ్వరి, చంద్రకళ, ప్రశాంతి, తిరుమల, భారతి, ఎల్టీ సంగీత, తదితరులు పాల్గొన్నారు. కాగా.. జైనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వైస్ఎంపీపీ చిర్లె లక్ష్మణ్తో పాటు పలువురు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ర్టలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత
మాస్కు సరిగా ధరించలేదని చితకబాదిన పోలీసులు