ఊట్కూర్, ఏప్రిల్ 15 : కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రవి సూచించారు. గురువారం మండలంలోని బ స్టాండ్ చౌరస్తాలో ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు కరోనా నిబంధనలను వివరించారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరవద్దని, ముఖానికి ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై సురేందర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
నియంత్రణకు సహకరించాలి
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 15 : కరోనా నియంత్రణకు ప్రైవేట్ దవాఖానల వైద్యులు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ అన్నారు. పట్టణ శివారులోఉన్న డీఎంహెచ్వో కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల వైద్యులకు గురువారం కరోనా వ్యాధి నియంత్రణ, చికిత్సలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో 10 కన్నా ఎక్కువ పడకలు ఉన్న దవాఖానల్లో కొవిడ్ 19 చికిత్సలు చేసుకునేందుకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ, మాస్ మీడి యా అధికారి హన్మంతు, ప్రైవేట్ దవాఖానల వైద్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న టీకా
దామరగిద్ద, ఏప్రిల్ 15 : అర్హులందరూ కరోనా టీకా వేయించుకోవాలని ఫార్మసిస్ట్ అద్దన్ వెంకట్రామారెడ్డి అన్నారు. మండలంలోని ప్రజలకు స్థానిక దవాఖానలో కొ విడ్ టీకా కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం టీకా తయారు చేసిందన్నారు. ప్రజలందరి క్షేమం కోసం టీకాను పంపిణీ చేయడానికి ప్ర భుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదన్నారు. దవాఖానల్లో ప్రజలకు అన్ని వ సతులను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చెరువులు, కుంటలను నిత్యం పర్యవేక్షించాలి