కోవిడ్ మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మరోవైపు మృతదేహాలతో స్మశానవాటికలు కూడా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. రోజుకి పదులు సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయని పట్నా నగర్ నిగం స్మశానవాటిక అధికారి చెబుతున్నారు. మాములు మృతదేహాలతో పాటు కోవిడ్ డెడ్ బాడీలు కూడా వస్తున్నాయని తెలిపారు. దీంతో 24గంటలు దహనసంస్కారాలు కొనసాగిస్తున్నామన్నారు.