ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
పూలే ఆశయాలను కొనసాగిద్దాం
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
నల్లమలలో జ్యోతీరావు పూలే జయంతి
అచ్చంపేట, ఎప్రిల్ 12: బడుగుల విద్యా అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతీరావు పూలే అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ్యోతీరావు పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక దార్శనికుడు పూలే అన్నారు. పూలే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడినవర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. విద్యతోనే బలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే విశ్వసించారన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహగౌడ్, రాజేశ్వర్రెడ్డి, బాలరాజు, జైపాల్నాయక్, విష్ణువర్ధన్రెడ్డి, పర్వతాలు, శ్యాంగౌడ్, సింగోటం, ఈశ్వర్లాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పూలే ఆశయాలను కొనసాగిద్దాం
కోడేరు, ఏప్రిల్ 11: భారతదేశ తొలివిప్లవకారుడు మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాలను ప్రతిఒక్కరం కొనసాగిస్తూ ముందుకుసాగాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం పేర్కొన్నారు. టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్రెడ్డి ఆర్థిక సహకారంతో మండలంలోని బావాయిపల్లిలో అభినవ యూత్ ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. అలాగే కోడేరు వడ్డెరవాలనీలో పూలే విగ్రహానికి సర్పంచ్ వెంకటస్వామితోపాటు పూలే, అంబేద్కర్ జాతర కమిటీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధ్దన్రెడ్డి, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ కుర్మయ్య, విండో చైర్మన్ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్గౌడ్, రాజవర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జగదీశ్వర్రావు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి రామకృస్ణ, సర్పంచ్ కర్రెమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
బడుగుల అభ్యున్నతికి కృషి
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 11: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతీరావు పూలే అని పలువురు నాయకులు అన్నారు. పెద్దకొత్తపల్లిలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్గౌడ్, జెడ్పీటీసీ గౌరమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ రేణుక, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పూలే విగ్రహం వద్ద ప్రజా సంఘాల నివాళి
కొల్లాపూర్, ఏప్రిల్ 11: పట్టణంలోని మాధవస్వామి ఆలయ చౌరస్తాలో పూలే విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ప్రజా, దళిత సంఘాల నాయకులు వేర్వేరుగా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కేతూరి రాము, ఉపాధ్యక్షుడు కరీమొద్దీన్, మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జాఫర్, సింగిల్విండో డైరెక్టర్ నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ దళితదండు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు, దళిత నాయకుడు సంపంగి నర్సింహ, టీఎన్జీవోస్ జిల్లా గౌరవాధ్యక్షుడు సత్యనారాయణయాదవ్, లక్ష్మణ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జగదీశ్వరుడు పాల్గొన్నారు.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్, ఏప్రిల్ 11: అమ్రాబాద్, పదర ఉమ్మడి మండలాల్లో పూలే జయంతి సందర్భంగా బీసీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనిల్ పాల్గొని పదర మండలకేంద్రంలో జ్యోతీరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో యాదవ సంఘం మండలాధ్యక్షుడు శ్రీనుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లేశ్, అంబేద్కర్ సంఘం నాయకలు బాలకిష్టయ్య తదితరులు పాల్గొని వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోలి శ్రీనివాసులు, రాజు, గోపాల్, ప్రశాంత్, నాసరయ్య, మల్లికార్జున్, లింగం తదితరులు పాల్గొన్నారు.
ఉప్పునుంతల మండలంలో..
ఉప్పునుంతల, ఏప్రిల్ 11: మండలంలో అంబేద్కర్ యువజన సంఘం, పూలే ఉత్సవ కమిటీ, బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. ఉప్పునుంతల అంబేద్కర్ చౌరస్తాలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్రెడ్డి, భూపాల్రావు, అనంతారెడ్డి, బాలయ్యగౌడ్, నిరంజన్, గణేశ్, సుధాకర్, శ్రీను, వెంకటేశ్, శేఖర్, మల్లేశ్, కృష్ణయ్య, కాశన్న, రాంచంద్రం, తిరుపతయ్య, శ్రీధర్, అల్లాజీ పాల్గొన్నారు.
లింగాల మండలంలో..
లింగాల, ఏప్రిల్ 11: లింగాల గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్పంచ్ తిరుపతయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో జ్యోతీరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రానోజీ, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మల్లేశ్, వార్డు సభ్యులు శ్రీనివాసులు, నాగార్జున్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసులు, శ్రీశైలం, శశిధర్ పాల్గొన్నారు.
చంద్రకల్లో పూలే విగ్రహావిష్కరణ
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 11:మండలం లోని చంద్రకల్లో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాష్ట్ర నాయకులు ధర్మరాజు, ఎదిరేపల్లి కాశన్న, ఎంపీపీ ప్రతాప్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, గ్రంథాలయ మాజీ చైర్మన్ విష్ణు, సర్పంచ్ నాగన్న, డప్పుస్వామి, ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
క్రాంతిదర్శి, విద్యాప్రదాత జ్యోతీరావు పూలే
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 11: క్రాంతిదర్శి, విద్యాప్రదాత మహాత్మా జ్యోతీరావు పూలే అని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యానాయక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని గిరిజన సంఘం కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించడానికి అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు శంకర్నాయక్, మల్లేశ్, లక్ష్మణ్, వెంకటయ్య, నిరంజన్, కాశన్నయాదవ్, మహబూబ్అలీ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
సచిన్ వాజ్కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ అరెస్ట్
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో