ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ కాజీని ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ రెండు కేసులతో సంబంధం ఉన్న ముంబై క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన సచిన్ వాజ్ను మార్చి 13లో అరెస్ట్ చేసి సుమారు నెల రోజుల పాటు పలు అంశాలపై ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో ముఖేష్ ఇంటి వద్ద పేలుడుపదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో సచిన్ వాజ్కు సహకరించిన పోలీస్ అధికారి రియాజ్ కాజీని ఎన్ఐఏ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. రియాజ్ కూడా క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్స్పెక్టర్ (ఏపీఐ)గా విధులు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్తోపాటు 40 మందికిపైగా వ్యక్తులను ఎన్ఐఏ ప్రశ్నించింది.