కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు.
తెలంగాణ చరిత్ర గతిని మార్చిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాదన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగిన రోజు సందర్భంగా సోమవారం భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ముషీరాబాద్ రస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు షరీపోద్దీన్, జునేద్ బాగ్ధాది, శివ ముదిరాజ్, ప్రవీణ్కుమార్, ఆర్. మెజెస్, రాజు, కేఎం సాయి, కళ్యాణ్, ఇమ్రాన్, మోసిన్, మక్బూల్, వాహబ్, మసి తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ లో ..
దీక్షాదివస్ను పురస్కరించుకుని సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, సీనియర్ నాయకుడు సాంబశివరావుల ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తా, వైఎస్ఆర్ పార్కుల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
గాంధీనగర్లో..
గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం.రాకేష్కుమార్ ఆధ్వర్యంలో గాంధీనగర్ వై జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ముఠా నరేష్, పోతుల శ్రీకాంత్, ఆకుల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, నరింహారావు, పరుశరాం, ఎరం శ్రీనివాస్, సంతోష్, కిరణ్కుమార్, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.