చిక్కడపల్లి :అన్ని వర్గాల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చిక్కడపల్లి గంగపుత్ర(బెస్త) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద సంఘం ఆధ్యక్షుడు గుండు జగదీశ్ బాబు నేతృత్వంలో జల పందిరి తొట్టెలతో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఎస్సీ,బీసీ మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీటవేశారని అన్నారు. రాష్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు 15కోట్లు కేటాయించడంతో గతంలో కంటే ఈ సారి మరింత ఘనంగా ఆషాడమాస బోనాల ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణజయేందర్ బాబు, సంఘం నాయకులు సురేందర్, బంగారు సంపత్,మురారి వినోద్, నరాల వెంకటేష్, విజయ్,సాయిలు, నరసింహ,సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత,సుజాత, శివరంజని, స్వర్ణలత, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎరం శ్రీనివాస్ గుప్తా, ముఠా శివసింహ, రవి శంకర్ గుప్తా, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
తూనికలు కొలతలశాఖ కార్యాలయంలో
గాంధీనగర్లోని తూనికలు కొలతశాఖ రాష్ట్ర కార్యాలయం ప్రాంగణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ నవదుర్గా అమ్మవారి ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ వ్యవస్థాపకులు ఓఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో శ్రీ సాయి, ఎస్.బాల్రాజ్, రవీందర్, చిట్టిబాబు,శివకుమార్,మస్తాన్, రాకేష్, నవీన్ కుమార్, సురేందర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.