ఊట్కూర్, సెప్టెంబర్ 25 : చెరువులో పడి త ల్లి, కూతురు మృతి చెందిన ఘటన నారాయణపే ట జిల్లా ఊట్కూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి తం డాలో చోటు చేసుకున్నది. మృతుల కుటుంబ స భ్యులు, స్థానికుల కథనం మేరకు.. నారాయణపే ట మండలం సింగారం గ్రామానికి చెందిన చంద్ర ప్ప కుమార్తె రజిత(24)కు దామరగిద్ద మండలం వత్తుగుండ్ల వాసి తిమ్మప్పతో ఐదేండ్ల కిందట వి వాహం జరిగింది. వీరికి కూతురు శ్రీలత (ఏడా ది) ఉన్నది. తలనొప్పితో బాధపడుతున్న రజిత కూతురితో కలిసి తల్లిగారి ఊరైన సింగారం వెళ్తానని కుటుంబీకులతో చెప్పి ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లింది. రెండ్రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందాడు. 24న నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా శనివారం ఊ ట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండా సమీపంలో చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పర్వతాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్త, కుటుంబీకులు అక్కడకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. మహిళకు మతిస్థిమితం లేకనే చిన్నారితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పేట జిల్లా దవాఖానకు తరలించారు.