హిమాయత్నగర్ : కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా వారికి సమాన ప్రాధాన్యతనిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. క్రిస్మస్ సంద ర్భంగా పేద కైస్తవులకు క్రిస్మస్ కానుకలను మాజీ కార్పొరేటర్ జె.హేమలతయాదవ్తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
గురువారం నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చిలో కైస్తవులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లా డుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి సర్వ తోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జె.బాబుయాదవ్, డి.రాజేందర్కుమార్, యాదగిరి, సర్ఫరాజ్, పి.ప్రభాకర్గౌడ్, కె.శ్రీకాంత్, కృష్ణయాదవ్, అశోక్, సయ్యద్ బిన్ ఖార్వన్, అత్తాస్, మాధవి, బాప్టిస్ట్ చర్చి పాస్టర్ రెవరెండ్ జి.శామ్యూల్, అధ్యక్షుడు జిమ్మి, ప్రతినిధులు గోనె సల్మాన్రాజ్, డేవిడ్ మనోహర్, డానియల్, విజయ్కుమార్ పాల్గొన్నారు.