వెంగళరావునగర్ : విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్,జీపీఎఫ్ సమస్యల పై ప్రభుత్వంతో చర్చించనున్నట్టు టీఎస్ జెన్కో, ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు.
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్-1535 నూతన భవనానికి భూమిపూజ, న్యూఇయర్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణల కార్యక్రమాలు ఆదివారం వెంగళరావునగర్ జీటీఎస్ కాలనీలోని విద్యుత్శాఖ కార్యాలయంలో నిర్వహించారు. తొలుత భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభాకర్ రావు అనంతరం ఎస్పీ డీసీఎల్ సీఎండి రఘుమారెడ్డితో కలిసి డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడుతూ తక్షణమే పరిష్కారం కాని విషయాల పై విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందకూడదని అన్నారు. 1999లో ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఈపీఎఫ్, జీపీఎఫ్లను అందించడం జరిగిందని అయితే అతితక్కువ పీఎఫ్ వస్తుందని వినతులు అందడం వల్ల ఉద్యోగుల సౌకర్యార్థం అదనంగా మరో వెయ్యికోట్లు జమచేయాలని ప్రభుత్వానికి సిఫారసులు పంపడం జరిగిందన్నారు.
క్యాబినెట్ ఆమెదం పొందిన తర్వాత ఆశించినమేర ఉద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. ఉత్పత్తి సామార్థ్యం, ఆర్థిక పరిస్థితిని మరింతా పెంచుకోవడంతో పాటుగా ఖర్చును కూడా తగ్గించాల్సి ఉంటుందని, ఇది కార్మికుల చేతుల్లోనే ఉందన్నారు.
ఎస్పీడీసీఎల్ చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘమారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగం పురోగమిస్తుందంటే ఆది ఉద్యోగుల సమిష్టి కృషి వల్ల మాత్రమేనన్నారు. నేడు దేశం యావత్తు మన రాష్ట్రం వైపు చూస్తుందని దీనిని మరింత పురోగమించేందుకు కృషి చేయాలని సూచించారు. కరోనా వేళ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విధి నిర్వహణ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్-1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎం.ఏ.వజీర్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, జెన్కో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాము, కుమారస్వామి, ట్రాన్స్కో అధ్యక్షులు నగేష్, ఉపాధ్యక్షులు వెంకట్నాయక్, అబ్దుల్ తఖీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, నర్సింగరావు, శ్రీధర్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.