కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
మంగళవారం మండల పరిధిలోని దన్నారం గ్రామంలో మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూసి తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందో నని భయపడి అర్ధంలేని విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి పక్షాల విమర్శలను తిప్పకొట్టాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించేదని హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తప్పా ఇతర పార్టీలకు తావులేదని వివరించారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీ సురుసాని రాజశేఖర్రెడ్డి,సర్పంచ్ శ్రీదేవి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.