వనస్థలిపురం : నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నామన్నారు. తన నిధులను సీసీ కెమెరాల ఏర్పాటుకు కేటాయించడం జరిగిందని, కాలనీ సంక్షేమ సంఘాలు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలనిసూచించారు. విజయదుర్గ కాలనీ, చైతన్య నగర్లో రూ.88.77లక్షలతో డ్రైనేజీ, ఆఫీసర్స్ కాలనీలో రూ.34.50లక్షలతో డ్రైనేజీ, హస్తినాపురం సెంట్రల్, విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీల్లో డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీనూనాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, విశ్వేశ్వరయ్య కాలనీ అధ్యక్షుడు జిట్టా సంజీవరెడ్డి, అగ్రికల్చర్ కాలనీ అధ్యక్షుడు తాండ్ర మణిపాల్రెడ్డి, నాయకులు మహ్మద్ సయీద్ పాషా, శ్రీరాములుగౌడ్, విజయ్కుమార్, రఘుమారెడ్డి, పల్లం శ్రీనివాస్, నాగేశ్వరరావు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.