నవాబ్పేట, డిసెంబర్ 17 : అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కూచూర్కు చెందిన శేఖర్బాబుకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్వోసీని శనివారం హైదరాబాద్లో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఆపత్కాలంలో పేదలను ప్రభుత్వం అన్నివిధా లా ఆదుకుంటున్నదని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసాగా నిలుస్తున్నదన్నారు. శేఖర్బాబు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2లక్షల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, నాయకులు ప్రతాప్, నారాయణ, కృష్ణ య్య తదితరులు పాల్గొన్నారు.