మియాపూర్ : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్కు చెందిన గౌరి సీఎం సహాయ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. లక్షకు సంబంధించిన మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం తన నివాసంలో అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారిని కష్టనష్టాలలో ఆదుకునేందుకు పథకాలతో అండగా నిలుస్తున్నారన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యంతో తమ అనారోగ్యాలకు స్వస్థత చేకూర్చుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, పార్టీ నేతలు శ్రీను, సత్యనారాయణ, జంగయ్య, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.