కవాడిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లో పలు కాలనీలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గాను రూ. 3, 46,500 లక్షల విలువ చేసే చెక్కులను ఇంటింటికీ తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ భోలక్పూర్కు చెందిన శకుంతలకు. రూ. 55 వేలు, లతకు రూ. 35 వేలు, కే. రాములుకు రూ. 60 వేలు, ప్రవీణకు రూ. 48 వేలు, సయ్యద్ గులామ్కు రూ. 60 వేలు, రిజ్వానా అలీ రూ. 25,500, అజీమా బేగంకు రూ. 60 వేల చొప్పున పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్కుమార్, సీనియర్ నాయకుడు జునేద్ బాగ్ధాది, ఉపాధ్యక్షుడు ఏ. శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, రహీం, పబ్బ కృష్ణ, ఉమాకాంత్, వాహెబ్, అక్బర్, కళ్యాణ్, ఆరీపోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.