మారేడ్పల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పర్వదినాలకు తగిన ప్రాధాన్యతను ఇస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నాలుగోవ వార్డులోని రాందాస్ నగర్ లో రాష్ట్ర ప్రభుత్వ క్రిస్మస్ కానుకల ను స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న కైస్తవ మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వం ప్రతి యేటా ఉచితంగా కానుకలను అందజేస్తున్నదని తెలిపారు. కైస్తవులకు ప్రతి సంవత్సరం క్రిస్మస్ కానుకలను అందజేయడంతో పాటు చర్చిల వద్ద పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.
సమాజంలో అనేక మంది ఆర్థిక స్తోమత లేని పేదలు పండగ రోజున సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తరుపున ఈ కానుకలను ప్రతి ఏడాది పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్, సంతోష్, ప్రవీణ్ యాదవ్, సదానంద్గౌడ్, తేజ్పాల్, రాజా సింగ్ మురళి యాదవ్, సుశాంత్రెడ్డి, శ్రీకాంత్, ఉమా శంకర్, సంతోష్, మహిళ నాయకురాలు నివేధిత, సరిత తదితరులు పాల్గొన్నారు.