చిక్కడపల్లి :చిక్కడపల్లి వివేక్నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం ముగ్గురు దాతలు ముందుకు వచ్చారు. యోచన స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్, ఆంజనేయ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త జానకి సుధాకర్, సినీ ఆర్టిస్టు, మా అసోసియేషన్ మాజీ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సి. వెంకట గోవిందరావు, నారాయణ గూడ సాయి శ్రీనివాస్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ టి.రామకృష్ణలు దేవాలయం పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.
ఈమేరకు దేవాలయం కార్యనిర్వాహణాధికారి మాచర్ల దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ గుండెపూడి మురళీ ప్రసాద్లతో ఒప్పదం చేసుకున్నారు. ఈసందర్భంగా దాతలు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంజనీరింగ్ వారు ఆమోదించిన నూతన ఆలయ నిర్మాణ ప్రణాళిక, ప్రతిపాదన మేరకు ఫుట్టింగ్స్, పిల్లర్స్, స్లాబు, మెటిరీయల్ లేబర్తో సహా నిర్మాణము చేయిస్తామన్నారు.
పునర్నిర్మాణం తమ ఇష్టపూర్తింగానే ఒప్పందం చేసుకుంటున్నామని తెలిపారు. శిల్పి వేములప్రసాద్కు ఆలయ పునర్నిర్మాణం బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్చకులు బుగ్గా లక్ష్మీపతి శర్మ, ఎస్.బి.వి.ఎన్ ఆచార్యులు, మాజీ ధర్మకర్త శ్యామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.