చిక్కడపల్లి : దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్ డివిజన్లోని అరుంధతి నగర్ బస్తీలో జరిగిన అంబేద్కర్ వర్థంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
టీఆర్ఎస్ నాయకుడు రాజ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువజన విభాగం నాయకుడు ముఠాజయసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, ఎస్టీ ప్రేమ్, యాదగిరి, వెంకటేశ్, వెంకటేశ్ యాదవ్, భాగ్య, సుజాత, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.