జూబ్లీహిల్స్ : భావి భారత భవిష్యత్కు అవసరమైన రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతిని పురస్కరించుకుని యూసుఫ్గూడ డివిజన్లో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, రహ్మత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూసుఫ్గూడ డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదాస్ వేణుగోపాల్, రహ్మత్నగర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి శంకర్, నాయకులు పాల్గొన్నారు.