రాష్ట్రస్థాయిలో 1, 12, 88వ ర్యాంకులు సాధించిన
కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థులు
ఇందూరు, జూలై 28 : పాలిసెట్లో నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నగరంలోని కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు స్టేట్ ఫస్ట్తోపాటు 12వ, 88వ ర్యాంకులు సాధించారు. 120కి గాను 118 మార్కులతో మాలపల్లికి చెందిన అబ్దుల్ రెహమాన్ ముజ్తబా హష్మీ స్టేట్ ఫస్ట్, 116 మార్కులతో గాజుల్పేట్కు చెందిన సాయిఅక్షయ్ 12వ ర్యాంక్ సాధించారు. ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో తాము కాకతీయ కళాశాలలోని ఐఐటీ పోగ్రాంలో అడ్మిషన్ తీసుకున్నామని ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్, సాయిఅక్షయ్ తెలిపారు. స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాకతీయ విద్యాసంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి, స్కూల్ డైరెక్టర్లు రామోజీరావు, తేజస్విని, ప్రిన్సిపాల్ అభినందించారు. కాగా, జిల్లాలో మొత్తం 6161 (బాలురు-3226, బాలికలు-2935)మంది విద్యార్థులకుగాను ఎంపీసీలో 4950 (బాలురు-2518, బాలికలు-2432) అర్హత సాధించారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ తెలిపారు. బైపీసీలో 4566 (బాలురు-2290, బాలికలు-2276) మంది అర్హత పొందారని వివరించారు.