ఊట్కూర్, సెప్టెంబర్ 17: పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఊట్కూర్, మక్తల్, నర్వ మండలాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరుకాగా శుక్రవారం మక్తల్లోని ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ఉపయోగ పడుతుందన్నారు. ఆయా మండలాలకు చెందిన పెద్ద సోమన్నకు రూ. 40 వేలు, మహ్మద్ షఫీ రూ. 28 వేలు, శ్రీజ రూ. 47వేలు, శరణప్పగౌడ్కు రూ. 60 వేలు, లక్ష్మణ్కు రూ. 7వేలు, సాయిబన్నకు రూ. 56వేలు, సత్యనారాయణకు రూ. 60వేలు, వీరాస్వామికి రూ. 60 వేల విలువగల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మక్తల్, ఊట్కూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గుప్త, రవిశంకర్రెడ్డి, రామలింగం, ఈశ్వర్యాదవ్, శేఖర్రెడ్డి, నేతాజీరెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
విశ్వకర్మ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే
మక్తల్ టౌన్, సెప్ట్టెంబర్ 17: దేవుడి దృష్టిలో అందరూ సమానమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణులు( కమ్మరి, వడ్రంగి, కంచరం, శిల్పి, స్వర్ణకార చేతివృత్తులవారు) ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు నల్లజానమ్మ ఆలయం నుంచి మౌనేశ్వరస్వామి ఆలయం వరకు స్వామివారిని ఊరేగించారు. ఊరేగింపులో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో యజ్ఞా లు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరై మౌనేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశ్వబ్రాహ్మణులు ఎమ్మెల్యే చిట్టెంను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ఆలల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. చేతివృత్తుల వారికి ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. విశ్వకర్మల అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. అనంతరం మాద్వార్ బ్రహ్మయ్య, మిషన్ రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మక్తల్ విశ్వకర్మ అధ్యక్షుడు మిషన్ రాజు, ప్రధాన కార్యదర్శి సాయిజ్యోతి వెంకటేశ్, కోశాధికారి సీవీ నవీన్, చిన్నికృష్ణయ్య, మందిపల్ విశ్వనాథ్, పొర్ల విశ్వనాథ్, మురళి, రవి, విష్ణుమూర్తి, బ్రహ్మానందం, ఉజ్జల్లి మోనేశ్, సీవీ ఆంజనేయులు, లక్ష్మయ్య ఆచారి, రుద్రసముద్రం వెంకటేశ్, బాలరాజు, మిషన్ రమేశ్, రజనీచారి విశ్వకర్మలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.