ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
ఎమ్మెల్యే జోగు రామన్న
ఎదులాపురం, జూన్ 13: ఆదివాసీల ఆరాధ్యదైవం, తొలితరం ఉద్యమ నాయకుడు భగవాన్ భీర్సాముండా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట భీర్సా ముండా 121వ వర్ధంతిని ఆదివారం హీరాసుక్క ఆదివాసీ జాగృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న మాజీ ఎంపీ జీ నగేశ్ హాజరయ్యారు. ముందుగా భీర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ… చిన్నతనంలో విద్య, వైద్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి భీర్సా ముండాఅన్ని గుర్తుచేశారు. ఆయన జీవితా న్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆదివాసులకు ఉద్యమ దిశను చూపించిన మహానాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉత్త మ సేవా అవార్డు అందుకున్న జైనథ్ పోలీస్ స్టేషన్ రైటర్ కోవ రమేశ్ను శాలువాతో ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి టీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బని, దుర్గంశేఖర్, హీరాసుక్క ఆదివాసీ జాగృతి సమితి జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, నాయకులు కుర్సెంగే తా నాజీ , గెడం మనోహర్, దివ్యరాణి, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
జైనథ్, జూన్ 13: జైనథ్ మండలంలోని కౌఠలో ఇటీవల గుర్వార్ నీలాబాయి, సంటెన్న ఆనారోగ్యంతో మృతి చెందా రు. బాధిత కుటుంబసభ్యులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆదివారం ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉం టామని భరోసానిచ్చారు. ఆ యన వెంట ఆదిలాబాద్ మార్కె ట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రై తుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, నాయకులు విజ్జగిరి నారాయణ, దుర్గం శేఖర్ తదితరులున్నారు.