రామాయంపేట, జూలై 31: నేడు రామాయంపేట మండలం కోనాపూర్లో మహంకాళి బోనాల జాతర జరగనున్నట్లు రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ దోమ చంద్రకళ ఇమ్మానియేల్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి శనివారం తెలిపారు. బోనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.
నేటి నుంచి దుర్గాభవానీ జాతర
చేగుంట, జూలై 31: నేటి నుంచి మూడురోజుల పాటు దుర్గాభవానీ జాతర నిర్వహిస్తున్నామని ఆలయకమిటీ సభ్యులు, సర్పంచ్ స్వర్ణలత తెలిపారు. ఆదివారం ఉద యం హోమం, పోచమ్మ, ముత్యాలమ్మ, మత్తడి పోచమ్మల ఆలయాల వద్ద బోనాలు, ప్రత్యేక పూజలు, సోమవారం పోతరాజుల ప్రదర్శన, మంగళవారం దేవుని చెరువు వద్ద బండ్లబోనాలతో ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు.
నేడు చేగుంటలో బోనాలు
మండల కేంద్రం చేగుంటలో ఆదివారం బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు
ఉత్సవాలకు రావాలని మంత్రి, ఎంపీకి ఆహ్వానం
చందాయిపేటలో నేటి నుంచి మూడు రోజలపాటు జరుగనున్న దుర్గమ్మ ఉత్సవాలకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావును,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని హైదరాబాద్లో కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోశ్కుమార్,ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు తదితరులున్నారు.
బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు
నర్సాపూర్,జూలై31: నేడు, రేపు జరగబోయే బోనాల ఉత్సవాలకు నర్సాపూర్లోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆలయ నిర్వహకులు ఆలయాలను రంగులతో, విద్యుత్ లైట్లతో అందంగా అలంకరిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాలు
రామాయంపేట, జూలై 31: రామాయంపేట పట్టణంలోని మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ట్రస్టు బోర్డు చైర్మన్ సరాఫ్ పాండురంగాచారి-వరలక్ష్మి దంపతులు అమ్మవారికి శాంతి కల్యాణం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో భక్తు లు కుం కుమ పూజలు చేశారు. ఈవో మోహన్రెడ్డి, కమిటీ సభ్యులు, ట్రస్టుబోర్డు సిబ్బంది మాసుల శ్యాం రాజ్, పోచ య్య, యాదగిరి, సత్యం, నరేశ్, పూజారి గంగాధరచారి పట్టణంలోని భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
నేడు అమ్మవారికి బోనాలు
నిజాంపేట,జూలై31: నేడు మండలంలోని నస్కల్లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు గంగరాజు, శ్రీనివాస్గౌడ్, నర్సింహులు, మల్లేశం, హబీబ్, శ్రీనివాస్, రాజు ఉన్నారు.
నేటి నుంచి మహంకాళి జాతర
తూప్రాన్ రూరల్, జూలై, 31: ఉజ్జయిని మహంకాళి జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కరోనా నిబంధన లతో నిర్వహించుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాఘ వేందర్గౌడ్, కమిషనర్ మోహన్ సూచించారు.