Ratha Saptami 2022 | రథసప్తమి నాడు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేయాలంటారు ఎందుకు?
– వరప్రసాద్, కరీంనగర్
లోక బాంధవుడైన సూర్యుడు అవతరించింది రథ సప్తమి నాడే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాక, మాఘ శుక్ల సప్తమి నాడు రథ సప్తమి పర్వదినాన్ని చేసుకుంటాం.
జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్త సప్తికే
సప్త వ్యాహృతికే దేవీ నమస్తే సూర్య మాతృకే॥
‘ప్రాణులన్నిటికీ, విశ్వంలోని లోకాలన్నిటికీ తల్లివైన ఓ సూర్యుని మాతృదైవమా! ఓ సప్తమీ! నీకు నమస్కారం’ అనే ప్రార్థన రథసప్తమి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సూర్యుడికి ఇష్టమైంది జిల్లేడాకు. అందుకే దానిని అర్కపత్రం అంటారు. జిల్లేడుతోపాటు చిక్కుడాకులకు కూడా సూర్యరశ్మిని ఆకర్షించి, ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతున్నది. జన్మజన్మలుగా చేసిన శోక, రోగ, పాపాలను పోగొట్టాలనీ, మనో వాక్కాయాలతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను, రోగాలను తొలగించాలని సూర్య భగవానుణ్ని కోరుతూ రథసప్తమి నాడు స్నానం చేయాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులను, స్త్రీలు ఏడు చిక్కుడు ఆకులను తలపై ఉంచుకొని సూర్యోదయంతోనే స్నానం చేయాలి. ఆ మూలికలు మానవాళికి మేలు కలిగించేవని ఆరోగ్య శాస్త్రం చెబుతున్నది. అందుకే వాటికి అంత ప్రాధాన్యం ఏర్పడింది.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?