-గీత, నల్లగొండ
మహిషాసుర మర్దిని అయిన దుర్గాదేవి అంశలన్నీ తామస ప్రవృత్తిని హరింపజేసే ఉగ్రరూపాలు.
వివిధ మార్గాల్లో అమ్మవారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు భక్తులు.
కూష్మాండో బలిరూపేణ మమభాగ్యాదవస్థితః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలిరూపిణం॥
‘ఓ బలిదానమా! నా భాగ్యం వల్ల కూష్మాండ (గుమ్మడికాయ) రూపంలో ఉన్నావు. అమ్మవారికి సంతోషాన్ని కలగజేసి నా ఆపదలను నశింపజేయమ’ని ప్రార్థిస్తూ గుమ్మడికాయను బలిదానంగా ఇవ్వాలని సూచించారు. అలాగే అమ్మవారిని శాంతపరచి ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు ప్రీతిపాత్రమైన పులుపుతో కూడిన నిమ్మకాయల దండను తల్లికి వేయడం సంప్రదాయంగా వస్తున్నది.
‘కళావతీ కళారూపా కాంతా కాదంబరీ ప్రియా‘ అంటుంది లలితా సహస్ర నామం. అందుకే ఆమెకు కాదంబరి (మద్యం) వంటి పుల్లని రుచితో ఉండే నిమ్మకాయలను దండగా వేయడం, పులిహోర వంటి పుల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారమైంది. కాలక్రమంలో నిమ్మకాయలను దుష్టశక్తుల పీడా నివారణకు బలిగా ఉపయోగించడం మొదలైంది. అమ్మవారి మెడలో నిమ్మకాయల దండను వేయడం వెనుక కారణం ఇదే. సత్వ రూపిణులైన లక్ష్మీదేవికి గానీ, సరస్వతీ అమ్మవారికి గానీ ఈ ఆచారం వర్తించదు.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370