యాదాద్రి, జూన్21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొం ది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరి ప్ర దక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంట ల పాటు శ్రీవారి అష్టోత్తర శతఘటాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. బాలాలయం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉ దయం 4గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివే ధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుద ర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారు లను కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీరోజూ నిర్వహించే ని త్యకల్యాణోత్సవంలో భక్తులు పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో నే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. ఆల యంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు జరిగాయి.
రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం..
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధనీ సమేత రామ లింగేశ్వర స్వామికి సోమవారం విశేష సంఖ్యలో భక్త జనులు పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశ వులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశు డిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత వేళలో గంటన్నర పాటు శివుడిని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృ తాలతో అభిషేకం చేశారు. పంచామృతాలలో అభిషేకం చేశారు. పంచామృతాలలో శివలింగాన్ని అర్చించారు. విభూతితో ఆలం కరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణప తి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయం ఉప ప్రధాన పురోహితుడి ఆధ్వ ర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉద యం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి.
స్వామివారికి లక్ష పుష్పార్చన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం ఏకాద శి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తో క్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రగమ శాస్త్ర ప్ర కారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ఈ లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్య వేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఖజానాకు రూ. 5,84,551 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 5,84,551 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 45, 494, రూ.100ల దర్శనంతో రూ.8,000, వీఐపీ దర్శనాలతో రూ.15,300, నిత్య కైంకర్యాలతో రూ.1,200, సుప్రభా తంతో రూ.400, క్యారీబాగుల విక్రయాల ద్వారారూ. 1, 375, కల్యాణ కట్ట ద్వారా రూ. 21,600, వ్రతాల ద్వారా రూ.19,000, ప్రసాద విక్రయాలతో రూ. 2,96,990, టోల్ గేట్ ద్వారా రూ. 1,150, అన్నదాన విరాళంతో రూ. 14,352, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 54,220, వాహన పూజల ద్వారా రూ. 8,400, యాదరుషి నిలయంతో రూ. 50,150, పాతగుట్టతో రూ. 13,870, టెంకాయల విక్రయాలతో రూ. 15,000తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 5,84,551 ఆదా యం సమకూరినట్లు తెలిపారు.
మత్స్యాద్రిపై ఘనంగా కల్యాణం
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గు ట్టపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఏడు హూండీలను దేవదాయ ధర్మా దాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించగా 2 నెలల 27 రోజులకు గాను 3లక్షల 6వేల 628 రూపాయల ఆదాయం సమకూరిందని, దేవస్థానం అనుబంధ దేవాలయం వెంకటా పురం గ్రామ పరిధిలోని శ్రీ అలివేలు మంగపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహోత్సవాలను ఈ నెల 23 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొవిడ్-19 నిబంధనల మేరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి సుమతి, ధర్మకర్తలు, వేద పండితులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యాద్రిపై దుకాణాల బహిరంగ వేలం
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్టపై దుకాణ సముదాయాలకు 2021-22 సంవత్సరానికి గాను ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గం టలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యని ర్వాహణ అధికారి కే. రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1.తలనీలాలు సమకూర్చుకొనుట, 2.కొబ్బరికాయ లు అమ్ముకొనుటకు, 3.వాహన పూజ, సామాను అమ్ముకొను ట, 4. వాహనాల టోల్గేట్, 5.కూల్డ్రింక్స్ హోటల్ నిర్వహ ణ, 6.కొబ్బరి చిప్పలు సమకూర్చుకొనుట, 7. సత్యనారా య ణ స్వామి వ్రతసామాన్లు, కిరాణం, జనరల్ సామాగ్రి అమ్ముకొ నుట, 8.బొమ్మలు, క్యాసెట్లు అమ్ముకొనుట, 9.ఫోటో స్టూడి యో నిర్వహణ, 10.పూలు, పూలదండలు అమ్ముకొనే దుకా ణాలకు బహిరంగ వేలం నిర్వహిస్తామని, బహిరంగ వేలంలో పాల్గొను ఔత్సహికులు 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల లోపు టెండర్ ఫారంకు డీడీలు జతచేసి, ఆధార్ జీరా క్స్లను సీల్డ్ కవర్లో పెట్టి టెండర్ బాక్స్లో వేయాలని కోరారు.