అహ్మదాబాద్ : గర్ల్ ఫ్రెండ్తో శృంగారం చేసేందుకు మర్మాంగానికి జిగురుతో సీల్ (Private Parts Seal) వేసుకున్న ఓ యువకుడు శవమై తేలాడు. మృతుడు అహ్మదాబాద్లోని ఫతేవాడి ప్రాంతానికి చెందిన సల్మాన్ మీర్జా (25) గా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో పొదల్లో పడివున్న సల్మాన్ను గుర్తించిన బంధువొకరు కుటుంబీకులతో కలిసి స్థానిక దవాఖానలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన అహ్మదాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్కు చెందిన సల్మాన్ మీర్జాకు డ్రగ్స్ తీసుకోవడం అలవాటు. ఆయన గతంలో పెండ్లిచేసుకోవాలనుకున్న యువతికి కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నది. జూన్ 22 న డ్రగ్స్ తీసుకునేందుకు వీరిద్దరూ మరో మహిళతో కలిసి స్థానిక హోటల్లో రూం తీసుకున్నారు. అక్కడ డ్రగ్స్ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనాలన్న ఆసక్తి కలిగింది. అయితే, యువతి గర్భం దాల్చకుండా ఉండాలంటే కండోమ్ వాడాలనుకున్నారు. అయితే, వారి వద్ద కండోమ్ లేకపోవడంతో.. వైట్నర్తో కలిపి డ్రగ్గా తీసుకునే జిగురులాంటి పదార్థంతో సల్మాన్ మీర్జా తన మర్మాంగాన్ని సీల్ చేసుకున్నాడు.
ఇలాఉండగా, అంబర్ టవర్ ప్రాంతంలో అపస్మారకంగా చెట్ల పొదల్లో పడిఉన్న సల్మాన్ మీర్జాను చూసి గుర్తించిన బంధువు ఒకరు కుటుంబీకులకు సమాచారం అందించాడు. కుటుంబీకులు మీర్జాను సోలా సివిల్ దవాఖానలో చేర్చించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మీర్జా మృతిపై మూడు రోజుల తర్వాత బంధువు సైరాబాను మీర్జా పోలీసులకు ఫిర్యాదు చేసి అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. మర్మాంగాన్ని జిగురుతో సీల్ చేసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్లు తేల్చారు. పోస్ట్మార్టం నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటామని స్థానిక డీసీపీ ప్రేమ్సుఖ్ దేలూ చెప్పారు.
ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
తాలిబాన్ ఎన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లిందో తెలియదు : పెంటగాన్
కాబూల్లో ఉక్రెయిన్ విమానం హైజాక్
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..