వర్తక, వాణిజ్యం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన షిప్ ‘హెక్టర్’ తొలిసారిగా 413 ఏండ్ల క్రితం భారతదేశంలోకి ప్రవేశించింది. ప్రస్తుత గుజరాత్లోని సూరత్ పట్టణం ఓడరేవుకు (East India Ship) చేరుకున్నది. దేశంలోని ముఖ్య నగరాల్లో వాణిజ్యాన్ని వ్యాప్తి చేసిన ఈస్ట్ ఇండియా.. ఇక్కడి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మన దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని దాదాపు 200 సంవత్సరాల పాటు మనల్ని పాలించింది. వీరి రాక మన దేశం యొక్క భౌతిక, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసిందని కూడా చెప్పవచ్చు.
పోర్చుగల్, డచ్ వర్తకులు తమ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసుకునేందుకు వారు వివిధ దేశాలకు తరలివెళ్లారు. ఆ సమయంలో బ్రిటీష్ వారు కేవలం యూరప్కే పరిమితమై ఉన్నారు. అక్కడ వాణిజ్యం చాలా తక్కువగా ఉండటంతో మరో ప్రాంతంతో వాణిజ్యాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేశారు. తమ వ్యాపారాన్ని భారతదేశంలో విస్తరించేందుకు అప్పటి ఇంగ్లండ్ మహారాణి అనుమతి కోరారు. 1600 సంవత్సరంలో ఒక కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీ ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో వర్తకం చేసే ఉద్దేశంతో ఏర్పడింది. అందుకే ఈ కంపెనీకి ఈస్ట్ ఇండియా అనే పేరు వచ్చింది.
ఈ కంపెనీ 125 మంది వాటాదారులు, 72 వేల స్టెర్లింగ్ పౌండ్ల మూలధనంతో ఏర్పడింది. భారతదేశంలో వర్తకం కోసం వారి నౌక 1608 ఆగస్టు 24 న సూరత్ తీరానికి చేరుకున్నది. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ పరిపాలిస్తున్నాడు. దాంతో నౌక కెప్టెన్ హాకిన్స్, జహంగీర్ను కలిసి తమ వ్యాపారానికి సహాయం అర్ధించారు. అయితే, వర్తకానికి మొఘల్ రాజు అనుమతి ఇవ్వకపోవడంతో, అప్పటి బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు సర్ థామస్ రోను మధ్యవర్తిత్వం నెరిపెందుకు పంపింది. జహంగీర్తో థామస్ రో చర్చలు జరిపిన మూడేండ్లకు చివరకు అనుమతి లభించింది.
మన దేశంలోని అన్ని ముఖ్య నౌకాశ్రయాల్లో పరిశ్రమలు నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ.. 1646 వరకు మొత్తం 23 ఫ్యాక్టరీలకు అధిపతిగా మారింది. అయితే, మొఘల్ సామ్రాజ్యం బలహీనతలను సద్వినియోగం చేసుకున్న ఈ కంపెనీ క్రమంగా పరిపాలనలో జోక్యాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. ట్రేడింగ్ కంపెనీ నుంచి ప్రత్యేక పరిపాలనా సంస్థగా కూడా మారింది. చివరకు భారతదేశాన్ని తన హస్తగతం చేసుకుని దాదాపు 200 ఏండ్ల పాటు పాలించింది.
2019: యునటైడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్ను అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
2011 : ఆరోగ్య కారణాలతో ఆపిల్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన స్టీవ్ జాబ్స్
2006 : ప్లూటోను గ్రహాల వర్గం నుంచి అధికారికంగా మినహాయించిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్
1995 : విండోస్ 95 ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ
1989 : నెప్ట్యూన్ గ్రహం మొదటి క్లోజప్ ఫొటోలను తీసుకున్న నాసాకు చెందిన వాయేజర్
1968 : ప్రపంచంలో 5 వ థర్మోన్యూక్లియార్ పవర్ కలిగిన దేశంగా అవతరించిన ఫ్రాన్స్
1974 : భారతదేశం 5 వ రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నియామకం
భూకంపాలను తట్టుకొని నిలబడే థర్మాకోల్, కాంక్రీట్ మిక్సర్ గోడలు
జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు!
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..