గుర్తించిన ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు
నాలుగు అంతస్తులు కట్టొచ్చని వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 23: భూకంపాలను తట్టుకొని నిలబడేలా భవనాలను నిర్మించడంలో భవిష్యత్తులో థర్మాకోల్ కీలకం కానున్నది. గోడలు నిర్మించేప్పుడు సిమెంటు, కాంక్రీటు మిశ్రమం మధ్యలో(కాంక్రీటు లేయర్లు) థర్మాకోల్, లేదా పాలీైస్టెరీన్(ఈపీఎస్) ఉంచితే అవి భూకంపం వచ్చినప్పుడు కూలే ప్రమాదం తక్కువ అని ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి గోడలతో నాలుగు అంతస్తుల వరకు భవనాన్ని నిర్మించవచ్చని చెప్పారు. ఇలాంటి గోడల నిర్మాణానికి వారు ప్రత్యేక పద్ధతిని రూపొందించారు. ఇలాంటి భవనాలను నేషనల్ సీస్మిక్ టెస్ట్ ఫెసిలిటీ(ఎన్ఎస్టీఎఫ్) వద్ద పరీక్షించారు. అంతేకాకుండా ఇలాంటి గోడలతో కట్టిన ఇంటిలో చల్లగా ఉంటుందని చెప్పారు.