వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్ను వశం చేసుకున్న తాలిబాన్.. తమ సైనిక సామగ్రిని ఎంత ఎత్తుకెళ్లిందో తెలియదని పెంటగాన్ (Pentagon) పేర్కొన్నది. దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అనంతరం తమ సాయుధ దళాలకు పంపిన అమెరికా ఆయుధాలు ఎన్నింటిని తాలిబాన్ చేజిక్కించుకున్నదో పెంటగాన్ ఇప్పటికీ చెప్పలేకపోతున్నది. ఈ విషయాన్ని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. తాలిబాన్ వద్ద ఉన్న యూఎస్ ఆయుధాలు, వాహనాల సంఖ్యను లెక్కించడానికి రక్షణ శాఖ ప్రయత్నించిందా అని మీడియా సమావేశంలో ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.
‘ఆఫ్ఘనిస్తాన్ను వశపర్చుకున్న తర్వాతి పరిణామాల్లో, మా సైనికులకు సరఫరా చేసిన ఆయుధాల్లో తాలిబాన్ ఎన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నది అనే ఖచ్చితమైన జాబితా నా దగ్గర లేదు. మన ఆసక్తులకు హానికలిగించేలా ఆయుధాలు ఉపయోగించే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని కోరుకుంటున్నా. అలాగే, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తన వద్ద ఎలాంటి విధానపరమైన పరిష్కార మార్గాలు లేవు’ అని కిర్బీ పేర్కొన్నారు.
ఆగస్టు 15 న ఎలాంటి పోరాటం చేయకుండానే తాలిబాన్ మద్దతుదారులు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోకి ప్రవేశించారు. కొన్ని గంటల్లో నగరంపై పూర్తి నియంత్రణ సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రక్తపాతాన్ని నివారించడానికి దేశం విడిచి వెళ్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లేనందున రాజ్యాంగం ప్రకారం తానే యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతానని ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. తాలిబాన్తో పోరాటం కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. ఇదేసమయంలో, పాశ్చాత్య దేశాలు ఇక్కడి నుంచి తమ పౌరులను, రాయబార కార్యాలయ ఉద్యోగులను ఖాళీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
కాబూల్లో ఉక్రెయిన్ విమానం హైజాక్
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..