నల్లగొండ : బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన చల్లా రాఘవ (22) బైక్పై మిర్యాలగూడ నుంచి దామరచర్లకు బయల్దేరాడు. దామరచర్ల శివారుకు రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి కిందపడ్డాడు. ప్రమాదంలో రాఘవ ముఖానికి, తలకు బలమైన గాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ దవాఖానకు తరలించారు.