రంగారెడ్డి : పిడుగు పాటుకు ఓ మహిళ మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొంగర బాలరాజు, అంసమ్మ భార్యభర్తలు. గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం గొర్రెలను మేపడానికి గ్రామా శివారులోని పొలాల్లోకి వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడింది. దీంతో అంసమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందింది. బాలరాజుకు స్వల్ప గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత